ఈమధ్య సోషల్ మీడియా లో ప్రతి పెట్టడం తో అవి వైరల్ అవడమే కాకుండా అది బెడిసి కొట్టి వాళ్ళు ట్రోల్ అవడానికి కూడా కారణమవుతుంది. హీరోయిన్ల త‌రువాత మేక‌ప్ స‌హ‌జం. ఏదో స‌హ‌జంగా ఉన్న పాత్ర‌ల్లో న‌టించే వారు త‌ప్ప మిగిలిన అంద‌రూ క‌చ్చితంగా మేక‌ప్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఆ మేక‌ప్ సినిమా షూటింగ్, లేదంటే ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్ప‌టి వ‌ర‌కు అంటే ఓకే. కానీ నిద్ర‌పోయే స‌మ‌యంలోనూ మేక‌ప్ వేసుకొని నిద్ర‌పోతే. అది అనారోగ్యానికి హానిక‌ర‌మో లేదో తెలీదు గానీ.. అలాంటి ఫొటోలు క‌నిపిస్తే మాత్రం నెటిజ‌న్ల చేతిలో ట్రోల్స్‌కి గురి అవ్వాల్సిందే.

ఇప్పుడు అలాగే ట్రోల్‌కి గురి అవుతున్నారు ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ మీన‌న్. కుంకీ(తెలుగులో గ‌జ‌రాజు), సుంద‌ర‌పాండియ‌న్, జిగ‌ర్తాండ‌, మంజా పై, మిత్ర‌న్, రెక్కా వంటి త‌మిళ్ చిత్రాల్లో న‌టించిన ల‌క్ష్మీ మీన‌న్.. దాదాపు ఐదేళ్ల పాటు యాక్టింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఈ మ‌ధ్య‌లో చ‌దువుపై దృష్టిని పెట్టిన ఈ న‌టి.. ఇటీవ‌ల‌ పులికుట్టి పండి అనే త‌మిళ మూవీతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఇటీవ‌ల కొన్ని ఫొటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. అందులో ల‌క్ష్మీ ఓవ‌ర్ మేక‌ప్‌తో ఉంది. దీంతో నెటిజ‌న్లు ఆమెపై ట్రోల్ చేశారు. నిద్ర‌పోయే స‌మ‌యంలో మేక‌ప్ అవ‌స‌ర‌మా అంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు పెట్టారు.ఇక ఓ నెటిజ‌న్ ల‌క్ష్మీని ప్ర‌ముఖ న‌టి స‌రోజా దేవీలో పోల్చారు. సూర్య న‌టించిన ఆధ‌వ‌న్ చిత్రంలో స‌రోజా దేవీ ఓవ‌ర్ మేక‌ప్ వేసుకొని ఉండ‌గా.. ఆమెలా ఉన్నావంటూ ఆ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. మ‌రో నెటిజ‌న్.. నిద్ర‌పోయే ముందు కచ్చితంగా మేక‌ప్ ధ‌రించాల్సిందేనా అని కామెంట్ పెట్టాడు. కాగా ప్ర‌స్తుతం ఈ న‌టి గౌత‌మ్ కార్తీక్‌తో ఓ చిత్రంలో న‌టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: