ఇప్పుడు అలాగే ట్రోల్కి గురి అవుతున్నారు ప్రముఖ నటి లక్ష్మీ మీనన్. కుంకీ(తెలుగులో గజరాజు), సుందరపాండియన్, జిగర్తాండ, మంజా పై, మిత్రన్, రెక్కా వంటి తమిళ్ చిత్రాల్లో నటించిన లక్ష్మీ మీనన్.. దాదాపు ఐదేళ్ల పాటు యాక్టింగ్కి బ్రేక్ ఇచ్చారు. ఈ మధ్యలో చదువుపై దృష్టిని పెట్టిన ఈ నటి.. ఇటీవల పులికుట్టి పండి అనే తమిళ మూవీతో మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ.. ఇటీవల కొన్ని ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందులో లక్ష్మీ ఓవర్ మేకప్తో ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్ చేశారు. నిద్రపోయే సమయంలో మేకప్ అవసరమా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.ఇక ఓ నెటిజన్ లక్ష్మీని ప్రముఖ నటి సరోజా దేవీలో పోల్చారు. సూర్య నటించిన ఆధవన్ చిత్రంలో సరోజా దేవీ ఓవర్ మేకప్ వేసుకొని ఉండగా.. ఆమెలా ఉన్నావంటూ ఆ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్.. నిద్రపోయే ముందు కచ్చితంగా మేకప్ ధరించాల్సిందేనా అని కామెంట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం ఈ నటి గౌతమ్ కార్తీక్తో ఓ చిత్రంలో నటిస్తోంది.