ప్రస్తుతం బుల్లితెరపై వివిధ రకాల కార్యక్రమాలు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఇక ప్రతిరోజూ సరి కొత్త కాన్సెప్ట్ తో  కూడిన షోలు తెరమీదికి వస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను  పంచుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే బుల్లితెరపై ఎన్ని షో లు  ఉన్నప్పటికీ ఓంకార్ యాంకరింగ్ చేసే షో లకు  మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఒకప్పుడు వరుసగా డాన్స్ రియాలిటీ షోలు చేస్తూ  ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఓంకార్ ప్రస్తుతం అటు వెండి తెరపై కూడా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తున్నారు అనే విషయం తెలిసిందే.



 ఇకపోతే ప్రస్తుతం మా టీవీ లో వరుసగా షోలతో  అదరగొడుతున్నాడు ఓంకార్. సరికొత్త కాన్సెప్ట్ తో తెరమీదికి వచ్చి  బుల్లితెర ప్రేక్షకులందరికీ వినూత్న  ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాడు. ఇక ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్లీ ఒకసారి డాన్స్ ప్లస్ అనే డాన్స్ రియాల్టీ షో ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా అయితే.. ఓంకార్ కార్యక్రమాలలో  ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి అనే విషయం తెలిసినదే. ఇక ఇటీవల డాన్స్ ప్లస్ లో కూడా ఇలాంటి తరహా ఎమోషన్స్ ని మళ్లీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు ఓంకార్.



 డాన్స్ ప్లస్ లో  కంటెస్టెంట్స్ గురించి జడ్జ్ లు  ఎలిమినేషన్ వచ్చిన సమయంలో పోట్లాడుకుంటూ ఉండడం ఏకంగా  కొంతమంది కన్నీళ్లు పెట్టుకోవడం లాంటివి కూడా చూపిస్తూ అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓంకార్.  ఇటీవల విడుదలైన డాన్స్ ప్లస్ కి సంబంధించిన ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్  గా మారిపోయింది.  ఇక ప్రోమో  లో భాగంగా ఎలిమినేషన్ రౌండ్ వచ్చిన సమయంలో ఇక జడ్జిల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. యాని  మాస్టర్, ముమైత్ ఖాన్ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఒకరి డిసిషన్ ఒకరు తప్పు అంటూ చెప్పుకోవడం కన్నీళ్లు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇలా ఈ ప్రోమో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: