టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఖిలాడీ. ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని రమేష్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా తీస్తున్నట్లు టాక్. ఇక ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన క్రాక్ మూవీ ద్వారా భారీ సక్సెస్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ, ఆ మూవీ ద్వారా కెరీర్ పరంగా అతి పెద్ద బ్రేక్ ని అందుకున్నారు అనే చెప్పాలి.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ నెగటివ్ పాత్రలు చేయగా సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఆ మూవీని ఎంతో భారీగా ఠాగూర్ మధు నిర్మించారు. ఇక ఈ మూవీ కి థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రేక్షకాభిమానులు నుండి విపరీతమైన స్పందన లభించింది. క్రాక్ సూపర్ హిట్ తో ఒక్కసారిగా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడీ మూవీపై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. చాలా గ్యాప్ తరువాత రవితేజ డబుల్ రోల్ చేస్తున్న సినిమా కావడం, అలానే సినిమాలోని కొన్ని ట్విస్ట్ లు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి అనే వార్తలు ప్రచారం అవుతుండడంతో అందరూ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ ని ఈ ఏడాది వేసవి కానుకగా మే 28న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు హీరో రవితేజ కూడా ఈ మూవీ పై ఎంతో నమ్మకంగా ఉన్నారని, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనున్నట్లు టాక్. కాగా ఈ మూవీలో రవితేజ కి జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. సీనియర్ యాక్టర్ అర్జున్ ఇందులో విలన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: