టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు ఇందులో ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని బ్యాంకింగ్ రంగంలోని మోసాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇటీవల ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరుగగా, తదుపరి షెడ్యూల్ ని అమెరికాలో జరుపనున్నట్లు టాక్.
ఇక ఈ మూవీ కోసం మహేష్ బాబు పూర్తిగా తన మేకోవర్ ని చేంజ్ చేసి ఫుల్ గా క్రాఫ్ ని పెంచారు. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సినిమాలు, పర్సనల్ విషయాలను గురించి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల తో కూడా పంచుకునే అలవాటున్న మహేష్ బాబు, పలు ఇతర సినిమాలకు తనవంతుగా ప్రమోషన్ చేస్తూ సాయం అందిస్తూ ఉంటారు. అలానే కొన్ని సినిమాల సాంగ్స్, ట్రైలర్స్, టీజర్స్ రిలీజ్ చేయడం, ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆ యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించడం వంటివి కూడా చేస్తూ అందరి నుండి మరింత మంచి పేరుతో కొనసాగుతున్నారు మహేష్. 

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ప్రస్తుతం నితిన్, కీర్తి సురేష్ జతగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగ్ దే. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నా కనులు ఎపుడూ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ ని రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు మహేష్ బాబు తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. తొలిసారిగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో ఈ సాంగ్ ని యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపిస్తున్నాడు. కాగా మహేష్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న సాంగ్ కావడంతో దీనిపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ విధంగా నితిన్ మూవీకి మహేష్ సాయం అందిస్తున్నారు.... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: