లాస్ట్ సీజన్ అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ వినోదం పంచారు. ఇకపోతే తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రారంభం కానుంది. దీని కోసం నిర్వాహకులు కంటెస్టెంట్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం నిర్వాహకులు పలువురు కంటెస్టెంట్లను సంప్రదించారన్న లిస్టు ఒకటి బయటికి వచ్చింది. వారినే దాదాపు వారిని ఫిక్స్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు సీజన్ లలో మంచి దూకుడును కనబరచిన తమిళ్ బిగ్ బాస్ ఇప్పుడు కూడా హాట్ చర్చగా మారింది.
అసలు విషయానికొస్తే.. ఈ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీలను ఒకసారి చూద్దాం.. కూకూ విత్ కోమలి షో కంటెస్టెంట్లు దర్శ్ గుప్తా, పవిత్ర లక్ష్మి, శివానీ, అశ్విన్తో పాటు.. లక్ష్మీ రాయ్, పూనమ్ భజ్వా, కిరణ్, హేమ, సీనియర్ నటి రాధ, హీరో సిద్ధార్థ్లతో సంప్రదింపులు జరపారని సమాచారం. అటు టాలీవుడ్ నటి శ్రీరెడ్డికి తమిళ బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే బిగ్ బాస్ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.. ఏది ఏమైనా కూడా కమల్ హాసన్ లీడ్ చేస్తున్నారంటే దుమ్ము దులిపేయాల్సిందే..