పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే, మొదటి రోజుల్లోనే కాదు ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో  ఎన్నో సినిమాలలో అద్భుతంగా నటించాడు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలకు వ్యవహరించాడు. అంతేకాకుండా తన సినీ కెరీయర్ లో షూటింగ్ ప్రారంభమై,మధ్యలోనే ఆగిపోయి,విడుదలకు నోచుకోని కొన్ని సినిమాలు కూడా  వున్నాయి.. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో ఎన్ని విజయాలు అయితే ఉన్నాయో, అలాగే కొన్ని పరాజయాలు కూడా వున్నాయి..


వాటిలో అన్నవరం, బంగారం వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచి, అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా నిరాశే మిగిల్చాయి అని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పాప, అప్పట్లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. చూడడానికి అచ్చం మన ఇంట్లో అమ్మాయిలాగే అనిపించింది. ఇంతకు ఈ పాప ఎవరా అని ఆలోచిస్తున్నారా..! అయితే ఆ పాప విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


బంగారం సినిమా లో పవన్ కళ్యాణ్ హీరోగా, మీరా చోప్రా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈమెకు చెల్లెలిగా నటించిన సనూషా సంతోష్ మీకు గుర్తుండే ఉంటుంది.. కళ్ళద్దాలు పెట్టుకుని, కిలకిలా నవ్వుతూ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఈ చిన్నారి పాప ఇప్పుడు పెరిగి పెద్దదయింది. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టేందుకు కూడా సిద్ధమవుతోంది..


బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సనూషా సంతోష్ బంగారం సినిమా కంటే ముందే, పలు మలయాళ సినిమా ల్లో నటించింది. తన ఐదు సంవత్సరాల వయసు నుంచే నట జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మాయి, మొట్టమొదటిగా ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ చిత్రంలో బాగా అలరించింది. అంతేకాక పలు సినిమాలలో చిన్న వయసులోనే ఉత్తమ బాల నటిగా అవార్డు కూడా తెచ్చుకుంది . ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైనా, కొద్దిరోజులకు ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన జీనియస్ చిత్రం ద్వారా హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలో కూడా జర్నలిస్ట్ పాత్రలో నటించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: