మనీ మనీ, గులాబీ, అనుకోకుండా ఒక రోజు, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయరా, సత్య వంటి హిట్ చిత్రాల్లో నటించిన నటుడు, దర్శకుడు, నిర్మాత జేడీ చక్రవర్తి అంటే తెలియని వారెవరు ఉండరు. ముఖ్యంగా పాత తరం వారికి జేడీ అంటే ఓ యూత్ ఐకాన్.. ఇప్పుడు సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడే కానీ తనదైన టైం లో ఇండస్ట్రీ ని ఒక ఊపు ఆపాడు.. పెద్ద దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయాలనీ వెయిట్ చేసేవారు. జేడీ డేట్స్ కోసం పడిగాపులు కాసేవారు..

తొంభై టైం లో చక్రవర్తి అమ్మాయిలకు డ్రీం బాయ్ లా ఉండేవాడు.. తొలుత విలన్ పాత్ర లు పోషించిన జేసీ ఆ తర్వాత హీరోగా చేసి సక్సెస్ అయ్యారు.. కొద్దీ రోజుల్లోనే అయన స్టార్ అయిపోయాడు. హీరోగా చేస్తున్న టైం లోనే ప్రత్యేక పాత్రలు, గెస్ట్ పాత్రలు చేసి చక్రవర్తి ఎన్నో ప్రయోగాలు చేశారు. కాలక్రమేణా అయన ప్రాభల్యం తగ్గుతూ రావడంతో అయన నటనకు కామా పెట్టి దర్శకత్వం చేపట్టారు. అయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని బాగానే ఉన్నా కమర్షియల్ గా ఆడలేదు.. దాంతో ఆ ఆలోచన  పక్కనపెట్టి మళ్ళీ నటిస్తున్నారు.

తాజాగా అయన నటించిన ఓ చిత్ర ప్రమోషన్స్ లో కొన్ని స్టేట్మెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి.. రాంగోపాల్ వర్మ నిర్మించిన శ్రీదేవి అనే సినిమా హీరోయిన్‌తో లవ్‌లో పడలేదు. ఆ విషయంలో ఎలాంటి గోడవలు జరగలేదు. ఆ హీరోయిన్‌తో కాకుండా ఆమె తల్లిని ప్రేమించాను. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇక ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అంటూ జేడీ అసలు విషయం బయటపెట్టారు.శ్రీదేవీ అనే సినిమా షూటింగ్‌ నా వల్ల ఆగిపోలేదు. డైరెక్టర్‌కు, రాముకు ఏవో సమస్యలు ఉండి ఆ సినిమా ఆపేశారు. ఆ సినిమా షూటింగులో నేను కొట్టడం వల్లే డైరెక్టర్ తప్పుకొన్నారనే విషయం అబద్ధం. ఇలాంటి వార్తలు ఎలా పుడుతాయో అర్ధం కాదు అని జేడీ తెలిపారు.2019 తర్వాత పెద్దగా సినిమాలు రిలీజైన దాఖలాలు లేవు. హిప్పి, మైఖేల్, కాంట్రాక్టు, పట్టారై చిత్రాలు విడుదల అయ్యాయి. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా 70ఎంఎం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: