టాప్ హీరోయిన్  సమంత నటించిన ‘జాను’ విడుదలై ఒక సంవత్సరం దాటిపోయింది. ఆతరువాత ఆమె ఏ సినిమాను ఒప్పుకోలేదు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో తాను నటిస్తాను అంటూ ఆమె చెపుతున్నా ఆమెకు సరిపడే కథలు వ్రాసే రచయితలు దర్శకులు కరువైపోయారు.


గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో సమంత టెర్రస్ గార్డెనింగ్ పై అందరికీ అవగాహన కలిగే విధంగా తన ఇంటి మెడ పై రకరకాల కూరగాయల మొక్కలను పెంచుతూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే కూరగాయలు పండించుకోవాలి అంటూ సందేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ ముగిసి తిరిగి సినిమా షూటింగ్ లు ప్రారంభం అవ్వగానే సమంత ఒక భారీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.



ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘శాకుంతలం’ మూవీలో శకుంతలగా సమంత కనిపించబోతోంది. పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీని భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలలో విడుదల అయ్యే విధంగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ బడ్జెట్ 150 కోట్ల వరకు ఉంటుందని టాక్. వాస్తవానికి ఈ మూవీ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఈ మూవీలో దుష్యంతుడు పాత్రకు రానా ను ఎంపిక చేస్తారని అనుకున్నారు.


అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రానా ఈ పాత్రలో నటించడానికి ఆశక్తి కనపరచడం లేదు. దీనితో ఈ పాత్రను పోషించగల సరైన వ్యక్తి కోసం అన్వేషణ చేసినప్పటికీ చాలామంది ప్రముఖ నటులు ఈమూవీలో సమంత పక్కన దుష్యంతుడి పాత్రలో నటించడానికి పెద్దగా ఆశక్తి కనపరచలేదు అని టాక్. దీనితో గుణశేఖర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని మళయాళ నటుడు దేవ్ మోహన్ ఎంచుకున్నట్లు టాక్. అతడు ఇప్పటి వరకు నటించిన పెద్ద పేరున్న సినిమాలు లేకపోయినా సమంతకు జోడీగా దేవ్ మోహన్ సరిపోతాడని గుణశేఖర్ భావన అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘శాకుంతలం’ సినిమాతో తన సినిమా కెరియర్ కు అధికారికంగా కొన్నాళ్ళు విరామం ప్రకటించాలని సమంత ఆలోచన అన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: