‘రంగ్ దే’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే ముగించుకుని రిలీజ్ కు సిద్దమవుతోంది. రంగ్ దే మూవీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానపై రూపొందుతోంది. మంచి ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది. కాగా ఈ మధ్యనే రిలీజైన ఈ సినిమా ట్రైలర్.. పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు డీఎస్పీ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదటగా ఓటీటీ ప్లాట్ ఫాం పై విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.
కానీ వాటన్నింటిని వట్టి పుకార్లేనంటూ ఈ చిత్ర యూనిట్ తేల్చేసి.. మార్చి 26 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ రంగ్ దే మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేయనుందని ఈ చిత్ర యూనిట్. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారట. ఈ సందర్భంగా ఈ చిత్రయూనిట్ ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. ‘నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడు అననే అనని’..అంటూ సాగే ఈ మెలోడి పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఇక సూపర్ హిట్ పాటను సూపర్ స్టార్ మార్చి 4 తేదీన సాయంత్రం 4.05 గంటలకు పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ వెళ్లడించింది.