యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాంచి ఫాం లో దూసుకెళుతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తున్నాడు. గతేడాది ‘భీష్మ’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న ఈ హీరో ఈ ఏడాది హిట్లను అందుకోనున్నట్టే అర్థమవుతోంది. ఇటీవలె‘చెక్ ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నితిన్. ఈ సినిమాకు ఏలేటి దర్శకత్వం వహించారు. ఇక నితిన్ సరసన ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించింది. అలాగే పరెషానురా బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో లాయర్ పాత్రలో కనిపించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చెక్’ సినిమా ప్రేక్షకుల్లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత నితిన్ వెంకి అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
‘రంగ్ దే’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే ముగించుకుని రిలీజ్ కు సిద్దమవుతోంది. రంగ్ దే మూవీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానపై రూపొందుతోంది. మంచి ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది. కాగా ఈ మధ్యనే రిలీజైన ఈ సినిమా ట్రైలర్.. పాటలు  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు డీఎస్పీ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదటగా ఓటీటీ ప్లాట్ ఫాం పై విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.

కానీ వాటన్నింటిని వట్టి పుకార్లేనంటూ ఈ చిత్ర యూనిట్ తేల్చేసి.. మార్చి 26 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ రంగ్ దే మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేయనుందని ఈ చిత్ర యూనిట్. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారట. ఈ సందర్భంగా ఈ చిత్రయూనిట్ ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. ‘నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడు అననే అనని’..అంటూ సాగే ఈ మెలోడి పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఇక సూపర్ హిట్ పాటను సూపర్ స్టార్ మార్చి 4 తేదీన సాయంత్రం 4.05 గంటలకు పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ వెళ్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: