జబర్ధస్త్ బ్యూటీ యాంకర్ అనసూయ అనే కంటే నటి అనసూయ అంటేనే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుతం అనసూయ టీవీ షోల కంటే సినిమాలతో ఫుల్ బిజీగా వుంది . ఇప్పటికి జబర్ధస్త్ షో లో యాంకర్ గా చేస్తున్న ఈ భామ మరి కొన్ని టీవీ షోస్ లోనూ యాంకరింగ్ చేస్తుంది. అంతే కాకుండా రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది . ఇక మరి కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేస్తూ అలరిస్తోంది. వాటిలో చావు కబురు చల్లగా సినిమా లో అనసూయ "పైన పటారం లోన  లోటారం" అనే సాంగ్ లో హీరో కార్తికేయ సరసన స్టెప్పులు వేసింది . అయితే గతంలో అనసూయ ఓ ఇంటర్వ్యూలో ఇకపై ఐటెమ్ సాంగ్స్ చేయనని..సినిమాల్లో ఐటెమ్ క్యారెక్టర్ లు చేయనని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్ నెటిజెన్ అనసూయ పోస్ట్ కి "మీరు ఇకపై ఐటెమ్ సాంగ్స్ చేయనని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు చేశారు అని క్వశ్చన్ వేసింది..దాంతో కోపం తో రగిలిపోయిన జబర్ధస్త్ బ్యూటీ.."అది ఐటెమ్ సాంగ్ కాదమ్మా.. స్పెషల్ సాంగ్..ఒకప్పుడు అమ్మాయిలను ఒక వస్తువులా చేసేవాళ్ళు దాన్ని ఐటెమ్ అన్నారు . కానీ ఒక నటి వచ్చి సినిమా డ్యాన్స్ చేస్తే స్పెషల్...దాన్ని స్పెషల్ సాంగ్ అంటారు" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక అనసూయ ఆన్సర్ కు కొంతమంది నెటిజన్లు శభాష్ అనసూయ బలే కౌంటర్ ఇచ్చావ్ అంటూ కామెంట్స్ పెడుతుండగా మరికొందరు నెటిజన్లు....అబ్బో అనసూయ భాగానే కవర్ చేసుకుంటుంది గా అంటున్నారు. అంతేగా మరి అవును ఐటెమ్ సాంగ్స్ చేస్తా నా ఇష్టం అంటే అనసూయ ఎవరైనా అడుగుతారా ..? ఇంటర్వ్యూలలో చేయనని చెప్పి ఇప్పుడు అభిమానులు ప్రశ్నిస్తే కవరింగ్ సమాధానాలు ఇవ్వడం ఎందుకో .

మరింత సమాచారం తెలుసుకోండి: