కీర్తి సురేష్ 'నేను శైలజ' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి' తో ఫేమస్ అయ్యింది. బెస్ట్ హీరోయిన్ గా జాతీయ అవార్డు సైతం అందుకుంది.

అయితే కీర్తి ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కార్ వారి పాట' లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుపుకుంటుంది. అయితే ఇటీవలే తన సోషల్ మీడియా లో కీర్తి సురేష్ కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలను చుసిన అభిమానులు బొండుమల్లిలా బాగున్నావని అంటున్నారు. అయిన కూడా అభిమానులు ఇంకొంచం బరువు పెరిగితే బాగుంటుందని. మహానటి లో చూసిన మునుపటి కీర్తి సురేష్ ని చూడాలనికుంటున్నామని దయచేసి బరువు తగ్గే ప్రయత్నం,సన్నగా కనబడే యత్నం చేయవద్దని కొందరు అభిమానులు అంటున్నారు.

అభిమానులు ఆలా అనడానికి ఒక కారణం ఉంది. మహానటిలో నిజంగా సావిత్రియే నటించిందా  అనేంతలా కీర్తిసురేష్ ను అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే మహానటి తర్వాత కీర్తి నుంచి వచ్చిన చిత్రం 'మిస్ ఇండియా' ఈ సినిమాలో కీర్తి లుక్ పూర్తిగా మారింది. అది కథ కోసమో లేక దర్శకుడి నిర్ణయంతో తెలియదు కానీ 'మిస్ ఇండియా' లో కీర్తి ఆలా కొత్త లుక్ లో  కనిపించేసరికి  అభిమానులు చూడలేకపోయారు. ఆ సినిమాకే అభిమానులు కీర్తి లుక్ విస్ బాగా లేదని అన్నారు. అయితే ఇప్పుడు 'సర్కారువారి పాట' కోసం కీర్తి ఎలా కనిపించబోతుందో అని అభిమానుల్లో టెన్షన్ మొదలైయ్యింది. కానీ తాజాగా కీర్తి సురేష్ ఫోటోలు చూస్తే మళ్ళీ మునుపటి కీర్తిని చూడబోతున్నామనే ఆనందం అభిమానుల్లో కలుగుతుంది.  

సినిమా ఏదైనా హీరో, హీరోయిన్స్ లుక్ పరంగా అందంగా ఉండాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటాడు. ఏ మాత్రం లుక్ పరంగా తేడా కొట్టిన ఆ సినిమా చూడటానికి ఎవరు ఆసక్తి చూపారు. తెలుగులో కొన్ని సినిమాలు లుక్ పరంగా ప్లాప్ అయినవి కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: