ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆ షోతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ తరువాత చిన్నగా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. అలాగే ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుంది...

ఇక అంతకుముందు ఆల్రెడీ 'విన్నర్, ఎఫ్ 2' చిత్రాల్లో మెరిసిన అనసూయ.. 'చావు కబురు చల్లగా' చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లో కార్తికేయతో కలిసి చిందులేసింది...కార్తికేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతుంది. అయితే.. నిన్న సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి టచ్ లో వున్న అనసూయ ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ.. 'అది ఐటెమ్ సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్.హీరోహీరోయిన్లు కాక ఎవరైనా స్పెషల్ యాక్టర్స్ చేస్తే దాన్ని స్పెషల్ సాంగ్ అంటారు. అయినా ఆ పాట లిరిక్స్ నచ్చి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నాను' అని వివరణ ఇచ్చింది.


ఇక ఇప్పుడు అనసూయ అన్న ఈ మాటలకు ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది.. నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా స్పెషల్ సాంగ్స్ చెయ్యడానికి నువ్వు ఎంత చెప్పుకున్న ఆడియన్స్ దృష్టిలో ఐటమ్ సాంగ్ చేసావు అని పలువురు నెటిజన్స్ ఈ కామెంట్స్ తో అనసూయను ట్రోల్ చేస్తున్నారు.అయితే.. అనసూయ ఎంత చెప్పుకున్నా కూడా స్పెషల్ సాంగ్ అనే పదం ఈ పాటలకి సింక్ అవ్వదు కాబట్టి, ఈ 'పైన పటారాన్ని' కూడా ఐటెమ్ సాంగ్ కిందకే వస్తుందని అనసూయకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: