బాహుబలి సినిమా తర్వాత బాగా క్రేజ్ సంపాదించిన ప్రభాస్ కేవలం హిందీ సినిమాలు చేయడానికే బాగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన వెయ్యి కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే.. కాగా సాహో సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్ ముంబయిలోని బాలీవుడ్ సినిమా ప్రముఖులతో బాగా పరిచయం పెంచుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కువగా ముంబైలోనే తన సమయం గడుపుతున్నారు. అందుకే ముంబై లో ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలని ప్రభాస్ అనుకుంటున్నారు.


ప్రభాస్ కి స్థిరాస్తులు ఉండటంతో పాటు సినిమాల ద్వారా కూడా బాగా డబ్బులు వస్తున్నాయి. ఒక సినిమాకి 75 కోట్ల రూపాయల్లో పారితోషికం పొందటంతో పాటు మూవీ లాభాల్లో కూడా ఆయన వాటా తీసుకుంటున్నారు. దీనితో ఒక్క సినిమాతోనే ఆయన వందల కోట్ల సంపాదిస్తున్నారు. ఐతే తన సొంత డబ్బులతోనే సముద్రం కనిపించే విధంగా అంటే సముద్రపు ఒడ్డున ఒక మంచి ప్రదేశం లో వందల కోట్ల విలువైన ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలని ఆయన భావిస్తున్నారట. అయితే ముంబై లో మంచి అపార్ట్మెంట్ వెతకడంలో టీ సిరీస్ మూవీ నిర్మాత భూషణ్ కుమార్ ప్రభాస్ కి సహాయం చేస్తున్నారని సమాచారం.


ఇకపోతే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కేజీఎఫ్ సినిమాని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ సలార్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించిన ఉన్నారని సమాచారం. ఆదిపురుష్ ఆడ చిత్రంలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఇకపోతే రాధా కృష్ణ కుమార్ రూపొందించిన రాధేశ్యామ్ సినిమా జులై 30వ తేదీన 2021లో విడుదల కానున్నది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: