టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ తీస్తున్న ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ తన కెరీర్లో చేయని ఒక విభిన్న పాత్ర ని మహేష్ బాబు ఈ సినిమాలో పోషిస్తుండగా తొలిసారిగా ఆయనకు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు అయిన 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారు ఇంత భారీ ఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ దుబాయిలో జరిగింది. హీరో హీరోయిన్ ల తో పాటు పలువురు ముఖ్య నటులు పాల్గొన్న కీలక సన్నివేశాల్ని ఆ షెడ్యూల్లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన యూనిట్ అతి త్వరలో తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారని ఇప్పటికే ఈ పాత్ర కోసం పలువురు ఇతర నటులను సంప్రదించిన దర్శకుడు పరశురామ్ ఎట్టకేలకు అనిల్ కపూర్ ను ఓకే చేసినట్లు చెప్తున్నారు.

మరోవైపు తొలిసారిగా మహేష్ తో చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎంతో ఆసక్తిగా అనిల్ కపూర్ ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం అనిల్ కపూర్ ని చాలా ఏళ్ళ తర్వాత తెలుగు తెరపై చూడవచ్చన్న మాట. మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: