‘ఢీ’ తర్వాత దర్శకుడిగా శ్రీను వైట్ల వెనుదిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా యాక్షన్ చిత్రాలకు కామెడీని మిక్స్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇక ‘మహేష్ బాబుతో చేసిన ‘ఆగడు’సినిమా నుంచి దర్శకుడిగా డౌన్ ఫాలో ప్రారంభం అయింది.కాగా ఢీ చిత్రంలో మంచు విష్ణు ,జెనీలియా జంటగా నటించగా విష్ణు కెరీర్లోనే ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది .ఈ చిత్రంలో బ్రహ్మానందం ,సునీల్ ,విష్ణు ల మధ్య వచ్చే సీన్లు నేటికీ హైలైట్గా నిలిచాయి .తర్వాత ఈ చిత్రాన్ని తమిళ్ లో మిరటాల్ గా ,బెంగాలీ లో ఖోకబాబు గా నిర్మించగా అక్కడ కూడా ఈ చిత్రం బారి విజయాన్ని నమోదు చేసుకుంది .
దీనిపై జెనీలియా రిప్లై ఇస్తూ ఈ చిత్రంలో నేను కూడా ఉన్నానని నీకు గుర్తుందా అని రాసారు .దానికి విష్ణు స్పందిస్తూ “నువ్వు నేను పోస్ట్ చేసిన ఫోటో చూడలేదా అందులో నువ్వు ఉన్నావ్ .నిన్ను ఎప్పటికి మర్చిపోలేను అని అన్నారు.కాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి .జెనీలియా విష్ణు ట్విట్టర్ సంభాషణ పై ఒకరు ఇలా ట్రోల్ చేసారు .’మర్చిపోయిన దానిని ఈ రేంజ్ లో కవరింగ్ చేయడం అంటే.. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సర్’ అంటూ ఎడిట్ చేసారు .
దీనికి అదుర్స్ చిత్రంలో బ్రహ్మానందం ఎన్టీఆర్ మాట్లాడుకుంటున్న చిత్రంతో ‘ఇంక లాగకండి తెగుద్ది ‘ అని విష్ణు ని అంటునట్లుగా ట్రోల్ చేసారు .కాగా విష్ణు జెనీలియా ను ట్వీట్ లో మర్చిపోవడం దానికి విష్ణు చేసిన కవరింగ్ వాటిపై వచ్చిన ట్రోల్స్ నెటిజన్లను విపరీతంగా నవ్విస్తున్నాయి.