తెలుగు సినిమా పరిశ్రమకి ఎమ్మెస్ రాజు నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దేవి సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా అడుగు పెట్టి ఆ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న దేవిశ్రీప్రసాద్ ఇక ఆ తర్వాత నుంచి తనకు వరుసగా వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని తెలుగు సినిమా చరిత్రలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
అయితే కొన్నాళ్ల క్రితం నుంచి తన సహచరుడైన తమన్ కెరీర్ పరంగా మంచి హవాను కొనసాగిస్తుండడం అలానే కొన్నాళ్ల క్రితం నుంచి దేవిశ్రీ అందిస్తున్న సాంగ్స్ ఆశించిన రేంజిలో శ్రోతలను ఆకట్టుకోకపోవడంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప మూవీపై ఆయన మరింతగా శ్రద్ధ పెట్టినట్టు చెబుతున్నారు. ఇక ఇటీవల వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ల కలయికలో తెరకెక్కిన ఉప్పెన మూవీకి దేశి ప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా కావడం అలానే చాలా ఏళ్ళ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కలిసి పని చేస్తున్న మూవీ కావడంతో పుష్ప  మ్యూజిక్ కోసం దేవిశ్రీ ఎంతో కష్టపడుతున్నారట. ఎలాగైనా దీనితో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుని కెరీర్ పరంగా మంచి పేరు దక్కించుకోవాలని చూస్తున్నారట దేవిశ్రీ.

పాన్ ఇండియా మూవీ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అదిరిపోయే నాలుగు ట్యూన్స్ సిద్ధం చేశారట దేవిశ్రీ. అలానే అతి త్వరలో మిగిలిన ఐదవ ట్యూన్ ని కూడా ఇవ్వనున్నారని ఇప్పటికే దాని కోసం కసరత్తు చేస్తున్న దేవిశ్రీ మొత్తం ఐదు పాటలను కూడా అదరగొడుతున్నట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మరో రేంజ్ లో ఉంటుందని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ బన్నీ, సుకుమార్ ల తో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కి మరింత మంచి పేరు తీసుకువస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. కాగా ఈ సినిమా ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: