రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రెట్రో లవ్ స్టోరీ మూవీ రాధేశ్యామ్. ఇటీవల సాహో మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ మూవీతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ లో ఒక వెరైటీ రోల్ లో నటిస్తున్న ప్రభాస్మూవీ ద్వారా మరొక భారీ విజయాన్ని  తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ, సీనియర్ టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రియదర్శి, షాషా ఛత్రి, జయరాం, తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుండి కూడా మంచి స్పందన లభించింది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక యదార్ధ  ప్రేమకథకి రూపంగా దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీని తీస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఎంతో వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఆడియన్స్ మనసును తాకే ఎన్నో మంచి ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని, అయితే క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎంతో కనెక్ట్ అవుతుందని, రెగ్యులర్ గా కాకుండా ఒకింత ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు. అలానే మరోవైపు అది యాంటీ క్లైమాక్స్ అనే ప్రచారం కూడా జరుగుతుండడంతో కొందరు ఆడియన్స్, మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ దానిని ఎంతవరకు అంగీకరిస్తారు అనే అనుమానాన్ని పలు టాలీవుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలు కేవలం కల్పితాలు మాత్రమే అని, నిజంగా ఈ మూవీ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా సినిమా చూసిన తరువాత గానీ చెప్పలేం అని, అప్పటి వరకు ఇటువంటివి విశ్వసించలేమని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: