చిత్ర పరిశ్రమలో కేవలం తన పాటలతోనే కాదు..తన అందంతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది ప్రముఖ
గాయని శ్రేయా ఘోషల్.. అతిచిన్న వయసులో అత్యున్నత స్థాయికి ఎదిగి 5 జాతీయ అవార్డులతో పాటు మరెన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులను, ప్రశంసలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ఏ భాషలో పాడినా ఆ పాటకే అందం వస్తుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించేలా అద్భుతంగా పాడి ఎందరో అభిమానులు సంపాదించుకుంది. సినిమాలో శ్రేయా పాడిన మొదటి పాట.. ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని తెచ్చిపెట్టింది..ప్రస్తుతం ఈ సింగర్ ఒక్కో పాటకు కొన్ని కోట్ల రూపాయల పారితోషకాన్ని అందుకుంటూ.. టాప్ సింగర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో చెలామణి అవుతుంది.. ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ తన సినీ, వ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటూ ఉండే
శ్రేయా ఘోషల్ తాజాగా ఓ శుభవార్త అందించారు. బేబీ శ్రేయాదిత్య కమింగ్ అంటూ స్వయంగా మధుర క్షణాలను ఫ్యాన్స్కు షేర్ చేశారు. తమ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని శ్రేయ వెల్లడించారు. ఈ శుభ సమయంలో అందరి
ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ శ్రేయా ట్వీట్ చేశారు. దీంతో ఆమెకు అభినందనల వెల్లువ కురుస్తోంది..2015,
ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ .. బాలీవుడ్.. మాలీవుడ్..
హిందీ, తెలుగు,
కన్నడ, తమిళం,
బెంగాలీ,
పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. తన విశేష ప్రతిభకు గాను పలు భాషల్లో అనేక జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది శ్రేయా ఘోషల్..ఇక ఈ మధ్య
టాలీవుడ్ లో ఎక్కువగా మన అగ్ర
సంగీత దర్శకుడు
దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలోనే ఎక్కువ పాటలు పాడుతోంది ఈ ప్రముఖ గాయని...!!