తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ బ్యాగ్రౌండ్ గురించి వచ్చిన హీరోలే ఎక్కవ. ఇక్క ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన  హీరోలే ఎక్కవ. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలు ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన బన్నీ, అల్లు శిరీష్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.

తాజాగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. నిర్మాత అల్లు అరవింద్‌కు బంధువైన విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను పిసిఎం స్టూడియోస్, మైత్రి అసోసియేషన్ బ్యానర్లను నిర్మిస్తున్నారు. చిట్టిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

విరాన్ ముత్తంశెట్టి హీరోగా బతుకు బస్టాండ్' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ముత్తంశెట్టి వారు బన్నీ నటిస్తున్న 'పుష్ప' ప్రొడక్షన్ లో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బుధవారం 'బతుకు బస్టాండ్' ఫస్ట్ లుక్ ని వదలడమే చేయడమే కాకుండా జూన్ 11న సినిమాని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అల్లు అర్జున్ మామ కొడుకు విరాన్ తో కలిపి మొత్తం మెగా కాంపౌండ్ నటీనటుల సంఖ్య 12కు చేరుకుంది.

అయితే ఈ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతీ హీరో ఏదో రకంగా సినిమాలు చేస్తే జనాల మధ్య హైప్ తెచ్చుకుంటున్నారు. మరి విరాన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా లాంఛ్ అవుతాడనే ఊహాగానాలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. అదే సమయంలో చైతన్య కు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని కూడా అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది ఇండస్ట్రీకి పరిచయం అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: