తెలుగులో టాప్ హీరో గా ఒక రేంజ్ క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలతోనే కాదు , టీవీ యాడ్స్ తో కూడా చాలా బిజీగా ఉన్నారు.అయితే మహేష్ బాబు సినిమాల మీద కన్నా ఆయనికి ఉన్న బిసినెస్ మీద ఎక్కువ సంపాదన వస్తుంది అని అందరికి తెలుసు.అయితే ఆయన్ని ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఫాలో అవుతున్నారు. ఎలా అంటారా అల్లు అర్జున్ కూడా మహేష్ బాబు ఎ యమ్ బి మల్టిప్లెక్స్ లాగా అల్లు అర్జున్ కూడా ఏ ఏ ఏ అని ఒక మల్టిప్లెక్స్ ని త్వరలోనే ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని త్వరలోనే అల్లు అర్జున్ ప్రకటించబోతున్నారు. ఇక  అల్లు అర్జున్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘పుష్ప‌’. రంగ‌స్థ‌లంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సుకుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తు సంగతి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఆర్య‌, ఆర్య 2 సినిమాలు రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల‌కు భిన్నంగా ‘పుష్ప‌’ సినిమాను సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ చేయ‌న‌టువంటి మాసీ లుక్‌ను ‘పుష్ప‌’ సినిమాలో బ‌న్నీ చేస్తున్నాడు. శేషాల‌చ‌ల అడ‌వుల్లో మాత్రమే దొరికే ఎర్ర‌చంద‌నం, దానికి సంబంధించిన స్మ‌గ్లింగ్‌పై ‘పుష్ప‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు సుకుమార్ చెప్పాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా టీజర్‌ను బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్‌ను కేర‌ళ‌, మారేడు మిల్లి, రంప‌చోడ‌వ‌రంలోని అట‌వీ ప్రాంతాల్లో చిత్రీక‌రించారు. ఇప్పుడు తెన్‌కాశీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. బ‌న్ని, ర‌ష్మిక మంద‌న్నల‌పై రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చిత్ర యూనిట్ చిత్రీక‌రిస్తుంది. దీంతో పాటు ఓ పాట‌ను కూడా చిత్రీక‌రిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 13న తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: