దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం.. గోదావరి జిల్లాలోని మారేడు మిల్లి అడవుల్లో కొనసాగుతోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పాటలు, రెండు సీన్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో చిరు-కాజల్ మధ్య ఒకటి, చెర్రీ-పూజా యుగళగీతం మరొకటి ఉంటుందట. ఇక మెగాస్టార్ - రెజీనా మధ్య కూడా మరొకటి ఉంటుందని సమాచారం. శివుడి మీద కూడా మరో పాట ఉంటుందట. ఇంద్ర సినిమాలోని 'బంబంబోలే' తరహాలో అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.
ప్రధానంగా చిరు-రెజీనా మధ్య వచ్చే మాస్ సాంగ్ ఫ్యాన్స్ తో కేక పెట్టిస్తుందని భోగట్టా. ఇందులో ఇందులో మెగాస్టార్ స్టెప్పులు.. నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంటాయట. చిరులోని గ్రేస్ ను మరో లెవల్ కు తీసుకెళ్తుందట ఈ సాంగ్. అంతేకాకుండా.. చిరు - చెర్రీ మధ్య వచ్చే మాస్ సాంగ్ దుమ్ము లేపుతుందని విశ్వసనీయ సమాచారం. ఇక, సినిమా క్లైమాక్స్ లో కాలికా దేవి సాంగ్ తో ఫైట్ మొదలవుతుందట. ఈ రెండూ రోమాంచితంగా ఉంటాయని అంటున్నారు.ఈ సినిమాలోనూ అంతకు మించి అన్నట్టుగా అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది..!!