పరిణితి చోప్రా బాలీవుడ్ నటి. ఇషాక్ జాదే అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా విజయవంతం కావడం తో అటు తర్వాత వరుస సినిమా అవకాశాలు రావడం మొదలైయ్యాయి. ఆలా వరుస సినిమాలు చేస్తూ తనకంటూ  నటిగా గుర్తింపు పొందిందిఒక పేరును సంపాదించింది. అయితే ఆమె తాజాగా నటించిన చిత్రం 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' ఫిబ్రవరీ నెలలో  ఓటిటీ లో విడుదలై హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సందర్బంగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇంటర్వ్యూ లో భాగంగా తన ఫస్ట్ కిస్ గురించి పరిణితి చోప్రా ఓపెనప్ అయ్యింది. తనకి పద్దెనిమిది సంవత్సరాలు ఉండగా ఓ అబ్బాయిని ముద్దు పెట్టుకున్నానని చెప్పింది. అదే తన లైఫ్ లో ఫస్ట్ కిస్ అని అది చాలా స్పెషల్ అంటూ పరిణితి చోప్రా తెలిపింది. అలాగే డేటింగ్ విషయం పై కూడా మాట్లాడుతూ వాటిపై పెద్దగా ఆసక్తి లేదని ఆమె పేర్కొంది. ఇక ఆమె చేసిన సినిమాల విషయానికి వస్తే ఇప్పటి వరకు పదికి పైగా చిత్రాల్లో పరిణితి చోప్రా నటించింది. అలాగే నటించిన ఇషాక్ జాదే చిత్రానికి  స్పెషల్ జ్యూరీ కింద నేషనల్ అవార్డును కూడా పరిణితి చోప్రా అందుకుంది. ప్రస్తుతం ఆమె సైనా బయోపిక్ లో  నటించగా ఈ చిత్రం ఇదే నెల 26 న విడుదల కాబోతుంది.

అయితే పరిణితి చోప్రా ఇప్పుడు హాట్ ఫోటో షూట్ లతో అదరగొడుతుంది. ఆ ఫొటోలన్నీ తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తుంది. ఆలా అప్లోడ్ చేయడం కాస్త అవి నెట్టింట తెగ హడావిడి చేస్తున్నాయి. ఒక పక్క హీరోయిన్ గా  చేస్తూనే మరో పక్క సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లలో కూడా పరిణితి చోప్రా నటించడం విశేషం. ఆమె సినిమా ప్రయాణం ఇలాగే ముందుకు సాగాలని,మంచి పాత్రలు చేయాలనీ కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: