రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం "పవర్ ప్లే". విజయ్ కుమార్ కొండ దర్శకుడు. అయితే ఈ సినిమా కోసం మొట్టమొదటి సారిగా విలన్ అవతారం ఎత్తారు హీరోయిన్ పూర్ణ. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు ఈమె. ఈ సినిమాలో డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి పాత్రలో ప్రేక్షకులకు కనిపించనున్నారు పూర్ణ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూర్ణ... ఈ సినిమాలో తన పాత్ర గురించి ఓ సీక్రెట్ ను బయటపెట్టింది. ఈ చిత్రంలో తానే డ్రగ్స్ తీసుకుని వ్యక్తి పాత్ర పోషించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు ఆమె. డ్రగ్స్ ని రకరకాలుగా తీసుకుంటున్న విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాలో... పూర్ణ డ్రగ్స్ పీల్చే సన్నివేశాల్లో నటించే సమయంలో పౌడర్ ని సరిగా పీల్చడం రాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని... అప్పుడు సెట్లోని ఒక నటుడు ఆ పౌడర్ ని ఎలా పీల్చాలో నేర్పినట్లు తెలిపింది. ఆ తర్వాత అందుకు సంబంధించిన సన్నివేశాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నటించారట ఈమె.
ఇకపోతే...హీరో రాజ్ తరుణ్ ఇప్పటి వరకు చేయని కొత్త జానర్ లో ఈ సినిమా ద్వారా మన ముందుకు రానున్నారు.