రామ్ గోపాల్ వర్మ ఈ పేరు అంటేనే వెంటనే గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ. ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా ఏ వ్యక్తి మీద అయినా ఎలాంటి సున్నితమైన అంశాల మీద అయినా సరే తన భావాలూ వ్యక్తం చేసి సేన్సేన్షన్ క్రియాట్ చేసి సెంటర్ అఫ్ అట్రాక్షన్ మారడం వర్మకి మొదటినుండి అలవాటు అదేవిదంగా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై తనదైన శైలిలో కామెంట్ చేసి మల్లి సెన్సేషన్ క్రియేట్ చేసారు రామ్ గోపాల్ వర్మ . ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 కరోనా ని అదుపుచేయడానికి ఉన్న ఒకేఒక్క మార్గం సోషల్ డిస్టెన్స్ అని డాక్టర్స్ చెప్తున్నా కారణంగా ప్రపంచ జనాభా ఇళ్లలోనే వుంటున్నారు . అత్యవసరమైతే గాని బయటకి రాకూడదని ప్రభుత్వాలు అన్ని లాక్ డౌన్ ప్రకటించాయి.  దీనితో సెలెబ్రేటిలు సామాన్య ప్రజలు అనే తేడా లేకుండా అందరు ఇంటికే పరిమితమయ్యారు.ప్రస్తుత పరిస్థితులపై రాంగోపాల్ వర్మ కి ఒక క్రేజీ ఐడియా వచ్చింది.దానిని ట్విట్టర్ లో ఇలా ప్రెజెంట్ చేసారు .ప్రతి భార్య తన భర్త ఎక్కువగా బార్లకి , పబ్ లకి బయటకి తిరగకుండా ఎక్కువసేపు తనతోనే ఉండాలని కోరుకుంటుంది కదా సరిగ్గా ఇదే ఆలోచన వర్మ బుర్రలో తిరిగింది ఏమోగానీ కరోనా వైరస్ పంపించమని ఎవరి భార్యనో ఆ దేవుడిని కోరినట్లుందని అనుమానంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు వర్మ.


ఇంతటితో ఆగకుండా దీనికి తనదైన స్టైల్ లో రీజన్స్ కూడా చెప్పారు వర్మ .సినిమా థియేటర్’స్ బంద్ , బార్లు మూసేసారు , ఆఫీసులు సెలవులు ఇచ్చేసారు  .ఆఫీస్ వర్క్ వుంది కాసేపట్లో వస్తాను అని అబద్ధం చెప్పే ఆవకాశం కూడా లేదు. ఇక చివరకి మిగిలిన ఆప్షన్ భార్యతో గడపడమే అని వర్మ అన్నారు .వర్మ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు కామెడీగాను సంతోషంగానూ బారిస్థాయిలో రియాక్ట్ అవుతూ లైక్లతోను కామెంట్లతోను హోరేత్తిస్తున్నారు .చాలా మంది భార్యలు ఆనందంగా వున్నారు కరోనా వల్ల. ఎందుకంటే వాళ్ళ భర్తలు వాళ్ళ దగ్గర ఉండడానికి కారణం అయింది కరోనా కాబ్బటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.జై రాంగోపాల్ వర్మ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: