1920ల కాలం నాటి కథగా ఒకవేళ
అల్లూరి, కోరమం బీఎం కలిస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఫిక్షనల్ స్టోరీ గా దర్శకుడు
రాజమౌళి ఈ
మూవీ ని తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ
మూవీ మోషన్
పోస్టర్, ఇద్దరు హీరోల టీజర్లు ఎంతో మంచి స్పందన దక్కించుకుని
మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఈ
మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. దీని అనంతరం
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో
ఎన్టీఆర్ ఒక భారీ
సినిమా చేయనున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలపై రూపొందనున్న ఈ
మూవీ మంచి పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని అలానే ఒక
బాలీవుడ్ స్టార్ నటి ఇందులో
ఎన్టీఆర్ కి జోడీగా నటించనుందని టాక్.
అలానే దీని తరువాత
యువ దర్శకుడు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
ఎన్టీఆర్ ఒక
సినిమా చేయనున్నారు. మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ ఫై నిర్మితం కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం
ప్రశాంత్ నీల్ కథ ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు టాక్. మరోవైపు
ప్రభాస్ తో సలార్ తీస్తున్న
ప్రశాంత్, ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అయిన వెంటనే దీనిని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీని తరువాత
కోలీవుడ్ దర్శకడు
అట్లీ, ఆపై సక్సెస్ఫుల్
డైరెక్టర్ కొరటాల శివల దర్శకత్వంలో కూడా
ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారని, ఆ విధంగా వరుసగా సినిమాల ప్లానింగ్ తో
ఎన్టీఆర్ తన
మూవీ కెరీర్ ని ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకున్నారని, ఈ విధంగా ఒకదాని వెంట మరొకటి మూవీస్ తో
ఎన్టీఆర్ బాక్సాఫీస్
రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నారని అంటున్నారు విశ్లేషకులు....!!