చిత్ర పరిశ్రమలోకి రావడం మన కష్ట ఫలితం అయితే, ఒకసారి వచ్చి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని గనుక అందుకుంటే ఆపై వచ్చే క్రేజ్, పాపులారిటీ ని నిజంగా ఆపలేం అనే చెప్పాలి. నిజానికి ఇక్కడికి వచ్చే చాలామంది తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం ఎంతో అరుదైన విషయం అని, అయితే ఆ గొప్ప అవకాశాన్ని ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన యువ జంట వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లకు దక్కిందని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు అప్పుడే హీరోయిన్ కృతి శెట్టి కి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫాలోవర్లతో పాటు అభిమాన సంఘాలు కూడా విపరీతముగా వెలుస్తున్నాయి.

యువ దర్శకడు బుచ్చి బాబు సనా దర్శకత్వంలో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ గా రూపొందిన ఉప్పెన మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఎంతో భారీగా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. తొలి సినిమా అయినప్పటికీ కూడా హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా తమ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మనసులో మంచి పేరు దక్కించుకున్నారు. ఇక దర్శకుడి ఆకట్టుకునే కథ, కథనం, హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన విజయ్ సేతుపతి అద్భుత నటన, దేవిశ్రీ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫి, భారీ నిర్మాణ విలువలు ఉప్పెన మూవీ ని సూపర్ హిట్ చేసాయి. 

ఇక మరోవైపు ఈ మూవీని చూసిన పలువురు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు సైతం అభినందిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ తో అప్పుడే వరుసగా సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటున్న కృతి, ఇప్పటికే తన కాల్షీట్స్ డైరీ ని ఆల్మోస్ట్ ఫుల్ చేసుకుందని, రాబోయే ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే టాలీవుడ్ లో కృతి స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అని, ఆ విధముగా ఒకే ఒక్క సినిమాతో కృతి సూపర్ క్రేజ్ దక్కించుకుందని అంటున్నాయి సినిమా వర్గాలు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: