శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "జాతి రత్నాలు" మూవీలో నవీన్‌ పోలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమానీ స్వప్న సినిమాస్‌ పతాకంపై అనుదీప్‌ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించారు.

తాజాగా 'జాతి రత్నాలు' ట్రైలర్‌ను పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేశారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్‌, టీజర్‌తో "జాతి రత్నాలు" సినిమా పై అంచనాలను పెంచిన చిత్రయూనిట్‌ తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమా ఓ రేంజ్‌లో ప్రేక్షకులను అలరించబోతోంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. హీరో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ ఒకరికి మించి ఒకరు అద్భుతంగా నటించారని ట్రైలర్ చెప్పేస్తోంది.హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చాలా అందంగా చూపించారు. ఇందులో తనకి కూడా ప్రాధాన్యమున్న పాత్రలాగే కనిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి లేడిస్ ఎంపోరియం శ్రీకాంత్ గా కనిపిస్తున్నాడు. టెన్త్ లో 60శాతం, ఇంటర్ లో 50శాతం, బీటెక్ లో 40శాతం మార్కులేంట్రా అంటే అందుకే ఎమ్ టెక్ చేయలేదని చెప్పే సమాధానం నవ్వు తెప్పిస్తుంది.

ఇక హీరో అనుకోకుండా కేసులో ఇరుక్కుని జైళ్ళో చేసే కామెడీ మరో హైలైట్ గా ఉంటుందని అనిపిస్తుంది. అక్కడ వెన్నెల కిషోర్ కూడా ఖైదీగా కనిపిస్తున్నాడు. వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద కనిపించాడు అంటే  కామెడీకి కొదవేలేదు అని అర్థం చేసుకోవచ్చు. ఇక నట బ్రహ్మ బ్రహ్మానందం గారు జడ్జిగా కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఇక ఈ సినిమాలో ఇంతమంది కామెడీ యాక్టర్ ఉండడంతో పక్క ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా సక్సెస్ సాధిస్తుందని చెప్పకనే ఊహించవచ్చు. హీరో నవీన్‌ పోలిశెట్టి "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" సినిమాలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. "జాతి రత్నాలు" మూవీ ద్వారా ఏ మేరకు ఆకట్టుకుంటాడు వేచి చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: