తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి."ఫిదా" సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో  పూజ హెగ్డే, రష్మిక మందన, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ లు సత్త చాటుతున్నారు. సాయి పల్లవిమాత్రం వాళ్ళను వెనక్కి నెట్టేసి ఆఫర్లను అందుకుంటుంది.ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్ స్టోరి' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మూవీలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచాయి.
 ఇంకా సాయి పల్లవి హీరో నాని సరసన "శ్యామ్ సింగ రాయ్", కృష్ణవంశీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది.

కొత్త వారిని పరిచయం చేస్తూ అందమైన ప్రేమకథలు తెరకెక్కించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల దిట్ట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా "డాలర్ డ్రీమ్" సినిమాతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. ఆతర్వాత "ఆనంద్ " మంచి కాఫీ లాంటి సినిమాతో పేక్షకులను అలరించి సక్సెస్ సాధించాడు. ఆతర్వాత గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, ఫిదా వంటి అందమైన కథలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "లవ్ స్టోరీ" మూవీ సిద్ధం చేస్తున్నాడు.

తాజాగా లవ్ స్టోరీ" మూవీ నుంచి సారంగా దారియా ‘అంటూ సాగే ఈ పాటను అక్కినేని కోడలు పిల్ల సమంత విడుదల చేసారు. ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. 'సారంగ దరియా' పాట సూపర్ హిట్ అయ్యింది. విడుదలైన 24 గంటల్లో ఏకంగా 7 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఈ ఏడాది బన్ని రికార్డు బ్రేక్‌ చేస్తారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. గతేడాది తివ్రిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన అలా వైకుంఠపురంలో చిత్రంలోని 'రాములో రాములా' సాంగ్‌ అత్యధిక వ్యూస్‌ సంపాదించి రికార్డు సృష్టించిన సంగతి తెలుస్తోంది.
ఈ ఏడాది సాయి పల్లవి 'సారంగ దరియా' ఈ రికార్డు బ్రేక్‌ చేస్తోందని భావిస్తున్నారు నెటిజనలు.

మరింత సమాచారం తెలుసుకోండి: