అనసూయ.. యాంకర్ గా పలు షో లు చేసిన ఈ అమ్మడు.. మంచి టాక్ ను అందుకుంది. అంతేకాదు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. అయితే హీరోయిన్ గా వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. కాగా, ఇప్పుడు మాత్రం పలు సినిమాలలో నటిస్తూ, మరో వైపు షో లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అను ఎప్పుడూ సోషల్ మీడియా లో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను , తనకు తెలిసిన వార్తలను తన అభిమానులతో పంచుకుంటుంది..


ఆమె చేసే ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఆమె వైపు ఎప్పుడూ ఓ కన్ను కనిపెట్టే ఉంటారు నెటిజన్లు. అలా ఈ మధ్య అనసూయ స్పెషల్ సాంగ్‌తో నెట్టింట్లో మంట పెట్టేసింది. చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ చేసిన స్పెషల్ సాంగ్ మరింతగా వైరల్ అయింది..అనసూయ మాత్రం దానికి వ్యతిరేకంగా. అమ్మాయిలను వస్తువులుగా చూసే వాళ్లు మాత్రమే అలా ఐటం సాంగ్ అంటారని, కానీ అది స్పెషల్ సాంగ్ అనాలంటూ అనసూయ చెప్పుకొస్తుంది. అలా అనసూయ చేసిన పైన పటారం అనే స్పెషల్ సాంగ్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది.


ఇక ఆ సాంగ్ పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ముందు నుంచి అనసూయ అంటే ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్. ఇలా స్పెషల్ సాంగ్‌లో అనసూయ రెచ్చిపోయి కనిపించడంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే వీటిలో ఓ నెటిజన్ మాత్రం అనసూయకు మద్దుతగా ఓ కామెంట్ చేశాడు. దానిపై అనసూయ రియాక్ట్ అయింది.తెలుగు వాళ్లకు ఎటువంటి అవకాశాలు ఇవ్వక పోగా తప్పుగా తిడతారు.. ఇలా మాట్లాడితే తెలుగు వాళ్లు ఇండస్ట్రీకి రావాలంటే భయపడతారు.. మారండి కొంచమైనా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అతని కామెంట్ చూసిన అను కాస్త ఎమోషనల్ అయ్యింది.కామెంట్‌ను రౌండప్ చేసి.. ఇలాంటి కామెంట్లు చూసినప్పుడే అంతా మంచి జరుగుతుందనే ఆశ కలుగుతుంది.. అందుకే మంచి జరిగే వరకు ప్రయత్నాన్ని వదలను.. ఇలాంటివి ధైర్యంగా చెప్పే హృదయం, గట్స్ ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: