తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొందరు డైరెక్టర్లు విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి తమకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించారు. రెండు, మూడు సంవత్సరాలకు కేవలం ఒక్క సినిమా చేసినా కూడా తమ మార్కు ఉండేలా జాగ్రత్తపడటం లో ఈ దర్శకులు దిట్ట. అయితే అలాంటి టాలెంటెడ్ సీరియస్ దర్శకుల సినిమాలు ప్రస్తుతం ఒకే సీజన్ లో విడుదల కాబోతున్నాయి. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. మరి ఆ డైరెక్టర్లు ఎవరో వారు చేయబోతున్న సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఐతే, అనగనగా ఒక రోజు, మనమంతా సినిమాలు తెరకెక్కించిన చంద్రశేఖర్ ఏలేటి 6 సంవత్సరాల తర్వాత నితిన్ తో కలిసి చెక్ సినిమా తీశారు. ఫిబ్రవరి 26వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఏలేటి నుంచి ఒక సినిమా రావడం ప్రేక్షకులని సంతోషపరిచే విషయమే. ఈసారి పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఏలేటి ఒక హాలీవుడ్ క్లాసిక్ మూవీలో నుంచి చెక్ క్లైమాక్స్ కాపీ కొట్టారని విమర్శలు కూడా వచ్చాయి. ఏదైతేనేం మళ్లీ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాలు తీయడం ప్రారంభించి ప్రేక్షకులని సంతోషపరుస్తున్నారు.

ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా వంటి అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా "లవ్ స్టోరీ" సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు విడుదలయి భారీగా రెస్పాన్స్ పొందాయి. లవ్ స్టోరీ మూవీ ఏప్రిల్ 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.

ఇకపోతే వెన్నెల, ప్రస్థానం వంటి సినిమాలు తెరకెక్కించి విలక్షణ దర్శకుడిగా పేరొందిన దేవకట్టా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో కలిసి రిపబ్లిక్ సినిమా రూపొందిస్తున్నారు. పొలిటికల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించనున్నారు. అయితే ఈ ముగ్గురు దర్శకులు కూడా ఒకే సీజన్ లో తమ సినిమాలను విడుదల చేస్తుండడం నిజంగా విశేషం అనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: