నేను, గమ్యం వంటి సినిమాల్లో వైవిధ్యమైన నటనా ప్రదర్శన కనబరిచి విలక్షణ నటుడిగా పేరొందిన అల్లరి నరేష్ ఎటువంటి ఛాలెంజింగ్ రోల్ లోనైనా చేయగలరు. కానీ ఆయన మూస ధోరణిలో కామెడీ చిత్రాలు చేసుకుంటూ పోతూ.. తన నటన టాలెంట్ కి తగ్గట్టుగా సినిమాలు చేయకుండా తన సమయం వృధా చేసుకున్నారు. కానీ ఇకపై తన నటనా టాలెంట్ ని అస్సలు వృధా చేయకూడదని భావిస్తున్న అల్లరి నరేష్ మరొక కంటెంట్ డ్రైవన్ సినిమాకి సైన్ చేశారట. అయితే ఈ సినిమాకి కూడా విజయ్ కనకమేడల దర్శకత్వం వహించనున్నారని సమాచారం అందుతోంది.
నాంది సినిమాతో బాక్సాఫీసు వద్ద కోట్ల రూపాయలను వసూలు చేసి నిర్మాత సతీష్ వేగేశ్న కి భారీగా లాభాలు తెచ్చి పెట్టడంలో విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ కీ రోల్ ప్లే చేశారు. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటి వరకు దాదాపు పది కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. దీనితో మళ్లీ వీరిద్దరి కాంబోలో వస్తున్న మరో సినిమాకి కూడా సతీశ్ వేగేశ్న నిర్మాతగా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం.
ఇకపోతే నాంది సినిమా హిట్ కావడంతో ఇటీవల ఆయన తిరుమల తిరుపతి శ్రీవారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన తదుపరి సినిమాలు కూడా అదే స్థాయిలో హిట్ కావాలని నరేష్ కోరుకున్నట్లు తెలుస్తోంది.