ఇండియన్ టాప్ క్రికెటర్‌ యువరాజ్ సింగ్.. బాలీవుడ్ నటి అయినా హాజెల్ కిచ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. 2011లో తన ఫ్రెండ్‌ బర్త్‌డేపార్టీలో యువరాజ్‌ సింగ్‌ను కలిసింది హాజెల్..ఆ తర్వాత వీళ్లిద్దరూ 2014లో స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో చండీగఢ్‌లో 2016 నవంబర్‌ 30న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు..ఇదిలా ఉంటె తాజాగా ఈమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటంటే..కొంతకాలం పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది హజెల్ కీచ్.

ఈ విషయాన్ని గురువారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు వెల్లడించింది. స్నేహితులు, బంధుమిత్రులెవరూ కూడా తనకు మెసేజ్‌ చేయొద్దని కోరింది. పూర్తిగా ఒకరిపై ఒకరం ఆధారపడటం అలవాటైన మనకు ఒంటరిగా ఎలా బతికేవాళ్లమో గుర్తుకురావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్‌ తీసుకోవాల్సిందేనని హజెల్‌ కీచ్‌ తెలిపింది.త్వరలోనే నేను, నా మొబైల్ బ్రేక్‌ తీసుకుంటున్నాం అంటూ పోస్ట్ చేసింది."ఈ విషయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుందని నాకు తెలుసు, కానీ తప్పదు..! సోషల్‌ మీడియాకు నేను వీడ్కోలు పలుకుతున్నాను. తిరిగి సోషల్‌ మీడియాలోకి వస్తాను..

 కానీ ఇప్పట్లో రాలేనని తెలిపింది. స్నేహితులు, బంధుమిత్రులెవరూ కూడా తనకు మెసేజ్‌ చేయొద్దు" అని హజెల్‌ కీచ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కోరింది..ఇక ఈ వార్తతో యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ ఈ విషయం గురించే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నట్లు సమాచారం..అయితే, గత కొద్ది రోజులుగా హజెల్‌ కీచ్‌ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: