ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో మొత్తం ఆలిండియా స్థాయిలో తన సత్తా రామ్ చరణ్ చాటనున్నాడు. దాని తరువాత బ్యాక్ టూ బ్యాక్ మూవీగా ఈ కాంబో మూవీ రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఈ మూవీలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి రకుల్ అయితే సూటబుల్ అని డైరెక్టర్ శంకర్ భావిస్తున్నాడుట.
అదే కనుక నిజమైతే రకుల్ లక్కీ అనే చెప్పాలి. రకుల్ ఈ మధ్య ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయి సీనియర్ హీరోల పక్కన కూడా నటిస్తోంది. ఇక అప్ కమింగ్ హీరో వైష్ణవ్ తేజ్ పక్కన కూడా క్రిష్ డైరెక్షన్ లో జంగిల్ బుక్ మూవీని చేసింది. ఇక రకుల్ సెకండ్ ఇన్నింగ్స్ ఓ మాదిరిగా నడుస్తున్న వేళ మళ్ళీ టాప్ స్టార్ రామ్ చరణ సరసన అంటే మాత్ర్మ గ్రేట్ ఆఫర్ అనుకోవాలి. అలాగే పాన్ ఇండియా లెవెల్ అంటే రకుల్ బాలీవుడ్ ఆశలకు కూడా కొత్త హోప్ ఇచ్చినట్లు అవుతుంది. మొత్తానికి ఈ మూవీలో రకుల్ హీరోయిన్ అని ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే చరణ్, రకుల్ కలసి బ్రూస్లీ, ధృవ మూవీస్ లో నటించారు. ఇది ముచ్చటగా మూడవ సినిమా అవుతుంది. సో మెగాభిమానులకు ఇది ఆసక్తికరమైన సమాచారమే.