పాన్ ఇండియా హీరోతో.. మరో పాన్ ఇండియా దర్శకుడు కలిసి ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుంది..? ఆ ఇద్దరూ కూడా ఇప్పుడు ఇండ్రస్టీలో మంచి హిట్లతో ఫామ్ లో ఉన్నారు.. అందుకే ఇప్పుడు ఇండ్రస్టీ కళ్ళన్ని ఆ పాన్ ఇండియా సినిమా పైనే ఉన్నాయి.. ఇంతకీ ఆ కాంబినేషన్ ఎవరిదంటే.. అదేనండి.. మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. మరియు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. వీరిద్దరి కాంబినేషన్లో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..ఈ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.. ఇక గతంలో కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ప్రొడక్షన్స్ పై భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని..

 వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది.. సినిమాలో ప్రభాస్ ఓ మాఫియా డాన్ గా కనిపించనున్నట్లు సమాచారం.. ఇక సలార్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అర్థం చెప్పాడు దర్శకుడు. తన సినిమాలో గ్రూపులో కుడిభుజంలా ఉన్న వ్యక్తి లీడర్ ఎలా అయ్యాడు అనేది చిత్రంలో ఆసక్తిగా చూపించనున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఎవ్వరూ చూపించని స్థాయిలో.. అంత పవర్ ఫుల్‌గా ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.సలార్ చిత్రం ఉగ్రంకు రీమేక్ అని కొందరు అంటుంటే...

 మరి కొందరు స్ట్రైట్ మూవీ అని చెప్పుకొచ్చారు. అయితే సలార్ చిత్రాన్ని యష్ కోసం రాసుకున్నాడట ప్రశాంత్ నీల్.కేజీఎఫ్ చిత్రానికి ముందు ఈ కథను యష్‌కు వినిపించగా, పలు కారణాల వలన ఆయన తిరస్కరించాడట.ఇప్పుడు ఆ కథలో కొన్ని మార్పులు చేసి ప్రభాస్‌తో సలార్ అనే మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో కథానాయికగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్‌లో బాలీవుడ్ నటులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: