శంకర్-చెర్రీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో సరికొత్త కాన్సెప్ట్తో రానున్న ఈ సినిమా ఇప్పటికే అనేక గాసిప్స్ ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తీయనున్నారని కొన్ని వార్తలు వస్తుంటే.. ఎలాంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం పొలిటికల్ ఎంటర్టైనర్గా రానుందని మరికొన్ని రూమర్లు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ను ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో కొత్త కథానాయికల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
అందులో ఒక పేరు రకుల్. ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ ఫోటో షూట్లకు కూడా హాజరైందని, అవి చూశాకే డైరెక్టర్ ఓకే చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో బిజీగా ఉన్న రకుల్ ఈ సినిమాతో మరో భారీ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకుందని టాక్. ఇక ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో చేశాడు. సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఇందులో పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఆ సినిమా మే 13న విడుదల కానుంది.