మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత
సినిమా ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టి ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.అయితే
పూరి ప్రస్తుతం
విజయ్ దేవరకొండ తో కలిసి ఒక భారీ బడ్జెట్
సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మద్యనే ఈ
సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ ని
మూవీ టీం విడుదల చేసారు.లిగేర్ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేసి
మూవీ టీం
పోస్టర్ ని విడుదల చేసింది. సాలా క్రాస్ బ్రీడ్ అని ఈ టైటిల్ కి కాప్షన్ పెట్టారు. ఈ
పోస్టర్ లో
విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో
విజయ్ దేవరకొండ పాన్
ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ
సినిమా హిందీలో , తెలుగులో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటుంది.
బాలీవుడ్ నటి
అనన్య పాండే ఈ సినిమాలో
విజయ్ కి జోడిగా నటిస్తుంది.
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ,
పూరి కనెట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని విడుదల తేదిని
మూవీ టీం త్వరలోనే ప్రకటించబోతుంది. ఇక ఇప్పటికే
అర్జున్ రెడ్డి సినిమాతో
బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న
విజయ్ దేవరకొండ ని
బాలీవుడ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.ఇక
పూరి ఈ
సినిమా తర్వాత చేయబోయే
సినిమా కూడా ముందే ఫిక్స్ అయిపోయింది అని టాక్ . ఆ
హీరో ఎవరో కాదు యంగ్ యాక్టర్
నాగ శౌర్య . లిగర్ తర్వాత ఆయన
నాగ శౌర్య తో చేసే కథ కూడా పూర్తి అయింది అని టాక్. ఈ
సినిమా లిగర్ లా పాన్
ఇండియా సినిమా కాకుండా తెలుగు వరకు ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని కూడా
పూరి కనెక్ట్స్ నిర్మాణంలోనే రాబోతుంది.