మాస్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ గత సినిమా ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టి ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.అయితే పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మద్యనే ఈ సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ ని మూవీ టీం విడుదల చేసారు.లిగేర్ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేసి మూవీ టీం పోస్టర్ ని విడుదల చేసింది. సాలా క్రాస్ బ్రీడ్ అని ఈ టైటిల్ కి కాప్షన్ పెట్టారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా హిందీలో , తెలుగులో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ కి జోడిగా నటిస్తుంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ , పూరి కనెట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని విడుదల తేదిని మూవీ టీం త్వరలోనే ప్రకటించబోతుంది. ఇక ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ని బాలీవుడ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.ఇక పూరిసినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా ముందే ఫిక్స్ అయిపోయింది అని టాక్ . ఆ హీరో ఎవరో కాదు యంగ్ యాక్టర్ నాగ శౌర్య . లిగర్ తర్వాత ఆయన నాగ శౌర్య తో చేసే కథ కూడా పూర్తి అయింది అని టాక్. ఈ సినిమా లిగర్ లా పాన్ ఇండియా సినిమా కాకుండా తెలుగు వరకు ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని కూడా పూరి కనెక్ట్స్ నిర్మాణంలోనే రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: