పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్ళీ రి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అందరి నిర్మాతలు ఆయన చుట్టూ చేరి వరసగా సినిమాలని సైన్ చేపించుకున్నారు. అందులో మొదటి
సినిమా హిందీ పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి రెడిగా ఉంది.ఈ
సినిమా తర్వాత
పవన్ కళ్యాణ్ 27 వ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాని ఇప్పటిదాకా ఆయన సినిమాల బడ్జెట్
కన్నా ఎక్కువ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు
నిర్మాత ఏ యమ్ రత్నం . అలాగే మొదటిసారి
కీరవాణి సంగీతంలో
పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ
సినిమా రాజుల కాలంలో జరిగే కథతో రాబోతుంది. ఇందులో
పవన్ కళ్యాణ్ ఒక
దొంగ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ
సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బైటకి వచ్చింది. అదేంటి అంటే ఈ సినిమాకి
హాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలకి విఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసిన బెన్ లాక్
పవన్ సినిమాకి పని చేయబోతున్నారు. ఈ సినిమాలో
గ్రాఫిక్స్ కి కూడా
మూవీ టీం పెద్ద పీట వెయ్యనుంది అని టాక్.
పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చేసిన సినిమాలా
కన్నా ఎక్కువ బడ్జెట్ తో వస్తున్న ఈ
సినిమా మీద అంచనాలు కూడా అలానే ఉన్నాయి.ఒక్కసారి
పవన్ కళ్యాణ్ సినిమాకి హిట్ టాక్ వస్తే ఎలా ఉంటాదో అందరికి తెలిసిందేయ్.ఇక ఈ
సినిమా కోసం
పవన్ కళ్యాణ్ అభిమానులే కాకా ఇండస్ట్రీలో అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ
సినిమా వచ్చే ఏడాది కానీ ఈ ఏడాది చివరిలో గాని విడుదల అవుతుంది అని అందరి అంచనా.కథానాయకుడు , మహనాయకుడు సినిమాల ఫలితాలతో డీలా పడిన
క్రిష్ ఈ సినిమాతో మళ్ళీ సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఈ
సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది.