'క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్' కలయికలో...  25 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం "ఫ్రెండ్ షిప్". 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని "ఫ్రెండ్ షిప్" పేరుతోనే.. 'సింగ్ అండ్ కింగ్' అనే ట్యాగ్ లైన్ జోడించి.. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత ఏ.ఎన్. బాలాజీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది.
మాజీ 'మిస్ శ్రీలంక' మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ 'లోస్లియా' హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో..  ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో ఆవిష్కరించి ఆశీస్సులు అందజేశారు. నిర్మాత-శ్రీలక్ష్మి జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మా చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరించి ఆశీస్సులు అందించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించాన్నారు.
నా కెరీర్ లో తొలిసారి "ఫ్రెండ్ షిప్" చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాన‌ని అన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మాటలు: రాజశేఖర్ రెడ్డి, సంగీతం: డి.ఎం.ఉదయ్ కుమార్, సినిమాటోగ్రఫీ:  శాంతకుమార్, నిర్మాత: ఏ.ఎన్.బాలాజీ, దర్శకత్వం: జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య!! 

మరింత సమాచారం తెలుసుకోండి: