ఆ సమయంలో మరో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఒకే చేయడం విశేషం.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలో ముందుగా రిలీజ్ అవుతుంది రాధే శ్యామ్.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ని సలార్ సినిమా రాబోతుంది. ఇక రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ల భారీ బడ్జెట్ సినిమాలు చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. అంటే లుక్స్ వేరేగా ఉంటాయి.. ప్రభాస్ 3 నెలల గ్యాప్ లో మూడు వేరు వేరు ప్రాంతాల్లో 3 డిఫరెంట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.
అదే సమయంలో ఈ సినిమాల కోసం 3 డిఫరెంట్ లుక్స్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు డార్లింగ్. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'జాతిరత్నాలు' ట్రైలర్ లాంచ్ సందర్భంగా బయటకు వచ్చిన ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. గుబురు మీసాలతో ప్రభాస్ పవర్ ఫుల్ గా ఉన్నాడు. ఈ లుక్ 'సలార్' లోని మరో క్యారక్టర్ కోసమని గెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ గుబురు మీసంతో పాటు ఫుల్ గడ్డంతో మోస్ట్ వైలెంట్ గా ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే ఈ సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ లో కనిపించడం ఖాయమని అర్థం అవుతోంది. అలానే ఇటీవల ముంబయిలో ఓ అభిమానితో దిగిన ఫోటోలో కళ్లజోడు తలకు క్యాప్ పెట్టుకుని పొడుగు మీసాలతో క్లీన్ షేవ్ లో కనిపించాడు ప్రభాస్. ఇది 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ లుక్ అనిపిస్తోంది.