సౌత్ ఇండియా సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన పాటలతో ప్రస్తుతం యూత్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు  ఎంతలా అంటే ఈ మధ్య కాలంలో ఏ పాట సూపర్ హిట్ అయినా.. అది కచ్చితంగా సిద్ శ్రీరామ్ పాడిన పాటే అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సిద్ పాడిన పాటలు అన్ని కూడా యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా హిట్ అనిపించుకుంది అంటే అతను పాడిన 'నీలి నీలి ఆకాశం' అనే పాట కంపెన్సేషన్ ఎంతో ఉందనేది వాస్తవం. అందుకే ప్రతీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇతనితో ఓ పాట పాడించాలి అని ఫిక్స్ అయిపోతున్నారు.


ఇక మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇప్పటికే రెండు, మూడు పాటలు పాడించుకున్నాడు.గోపి సుందర్, అనూప్ రూబెన్స్ వంటి వారు కూడా సిద్ ను వాడేశారు. అయితే దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఇప్పటి వరకూ సిద్ శ్రీరామ్ తో ఒక్క పాట కూడా పాడించలేదు.అయితే ఎట్టకేలకు 'రంగ్ దే' సినిమాలో 'నా కనులు' అనే పాటను పాడించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ పాటను విడుదల చేశారు. ఇలా విడుదలయ్యిందో లేదో ఈ పాట అప్పుడే వైరల్ అయిపోతుంది. ఈ పాట విన్నవాళ్ళంతా మళ్ళీ మళ్ళీ వింటున్నారు. శ్రీమణి అందించిన లిరిక్స్ కూడా బాగున్నాయి.ఇప్పటికే 'రంగ్ దే' నుండీ విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇది ఆ రెండిటిని మించి రికార్డులు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ సినిమాకి "తొలిప్రేమ"(2018) దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. "చెక్" సినిమాతో డీలా పడ్డ నితిన్ కు ఈ సినిమాతో మంచి హిట్ దక్కేటట్లు వుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: