టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ గత కొంతకాలంగా వరుసగా ప్లాపులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని హీరోగా చేస్తున్న సినిమా "శ్రీకారం".నాని "గ్యాంగ్ లీడర్ " తో గుర్తింపు తెచ్చుకోని యూత్ మనసులని కొల్లగొట్టిన హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహ‌న్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.కిశోర్.బి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. స్టార్ నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్ల‌స్‌’ బ్యాన‌ర్ ‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ.. యువకులంతా వ్యవసాయం పై కూడా ఫోకస్ పెట్టాలనే థీమ్ తో ఆ టీజర్ సాగింది. ఇక ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు. మిక్కీ జే మేయర్ సంగీతంలో రూపొందిన పాటలకు కూడా మంచి స్పందన లభించింది.ఇక మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న విడుదల కాబోతున్న ‘శ్రీ‌కారం’ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.



ఇక సినిమా ట్రైలర్ లో చూసినట్లయితే శర్వా, ప్రియాంక అరుళ్ మోహన్లవ్ ట్రాక్ తో ట్రైలర్ మొదలైంది. అటు తరువాత హీరో ఒక ఐటీ ఉద్యోగం చేస్తున్నట్టు చూపించారు. బెస్ట్ ఎంప్లాయ్ అయినప్పటికీ అతను తన సొంత ఊరెళ్ళి.. వ్యవసాయాన్ని ఓ కొత్త పద్దతిలో చెయ్యాలని నిర్ణయం తీసుకుంటాడు.ఈ నిర్ణయంతో అతని కుటుంబ సభ్యులు హర్ట్ అవుతారు. చివరికి అతను అనుకున్న లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగిలిన కథగా తెలుస్తుంది.లవ్,ఫ్యామిలీ, మెసేజ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో ట్రైలర్ ను తీర్చిదిద్దారు కానీ.. ‘మహర్షి’ ఛాయలు శతమానం భవతి ఛాయలు అలాగే కనిపిస్తున్నాయి. డైలాగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది.ఖచ్చితంగా మ్యూజిక్ పరంగా ఈ సినిమా హిట్ అయ్యేటట్లు అనిపిస్తుంది. ఇక చూడాలి వరుస ప్లాపులతో సత మత మవుతున్న శర్వానంద్ ఈ సినిమాతోనైనా హిట్ అందుకోని తన మునుపటి ఫామ్ ని కొనసాగిస్తాడో లేదో....





మరింత సమాచారం తెలుసుకోండి: