ఈ మధ్యకాలంలో తెలుగు సహా అన్ని భాషలలోనూ బయోపిక్ ల పరంపర కొనసాగుతోంది. సినీ, క్రీడా, రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల జీవిత గాథల నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు లోకి లెజెండ్రీ నటి జీవిత గాథ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు.. ఆమె మరెవరో కాదు తెలుగు నటి జమున. తన పదహారవ యేట తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె దాదాపు తెలుగులో ఉన్న అందరు హీరోలతో నటించింది. 

తెలుగులో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు లాంటి మహామహులు సరసన నటించిన ఆమె ఇప్పుడు ఉన్న తెలుగు అప్పటి తరం నటీనటులలో ఒకరని చెప్పవచ్చు. తాజాగా ఆమె జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేవినేని అనే సినిమా చేసిన శివ నాగు నర్రా అనే ఒక సీనియర్ దర్శకుడు జమున బయోపిక్ కి సంబంధించిన కథ కూడా సిద్ధం చేశారని అంటున్నారు. 

ఈ బయోపిక్ లో జమున పాత్రలో నటించేందుకు గాను తమన్నాను కూడా అప్రోచ్ అయినట్లు చెబుతున్నారు. అయితే ఇంకా తమ తమ అంగీకారం తెలుప లేదని అంటున్నారు. ఒకరకంగా ఈ బయోపిక్ పరంపర నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథను మహానటిగా రూపొందించడంతో మొదలైందని చెప్పవచ్చు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపుగా అప్పటి నుంచి చాలా రకాల బయోపిక్ సినిమాలు మొదలయ్యాయి. మరి ఇప్పుడు తమన్నా ఈ బయోపిక్ లో నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: