సిని హీరోల పైన అభిమానులు చూపే ప్రేమ అంతా ఇంత కాదు. తమ అభిమాన హీరోలను దేవుడు వలె కొలిచే అభిమానులు చాలానే ఉన్నారు. తమ హీరోలను వెండి తెరపై చూస్తేనే ఓ రేంజ్ లో పండగ చేసుకునే అభిమానులు వారిని ఇక బయట ప్రత్యేక్షంగా చూస్తే వారి ఆనందానికి అవదులు వుడవు. సెల్ఫీలు అంటూ, వీడియోలు అంటూ, ఆటోగ్రాఫ్ లు అంటూ తమ హీరో కోసం ఎగబడుతూ ఉంటారు. అలాంటి సంఘటనే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎదుర్కొన్నాడు. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న " ఆచార్య " సినిమాలో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ షెడ్యూల్‌లో  చిరంజీవి, రామచరణ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో 20 రోజుల షూటింగ్‌ పూర్తి చేసిన రామ్‌ చరణ్‌ భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్‌ పయనమయ్యాడు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న రామ్‌చరణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. చెర్రీతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

 దీంతో అక్కడ చిన్నపాటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికి చరణ్ ఓపికగా అభిమానులతో ఫోటోలు దిగుతూ అభిమానులకు ఆనందాన్ని పంచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. " ఆచార్య" సినిమాలో చరణ్ సిద్ద పాత్రలో నక్సలైట్ గా కనిపించనున్నడని సమాచారం. .నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో " ఆర్.ఆర్.ఆర్ " సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: