మొదటి సినిమా రిలీజ్ కాకుండానే చాలా క్రేజ్ తెచ్చుకుంది తుళు భామ కృతి శెట్టి. చిరంజీవి చిన్న మేనల్లుడు హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే తన నటనతో పాటు క్యూట్ నెస్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. ఇప్పటికే ఈమెకు వరుస అవకాశాలు క్యూ కడుతూ వస్తున్నాయి. అయినా సరే ఏది పడితే అది ఒప్పుకోకుండా తనకు వర్కవుట్ అవుతుందని భావించిన సినిమాలను మాత్రమే ఒప్పుకుంటుంది. తాజాగా ఆమె రామ్ పోతినేని లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని నిన్న సాయంత్రం సినిమా నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 

నిజానికి ఇప్పటికే ఆమె నాని సరసన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అటు నాని ఇటు సుధీర్ బాబు మరోపక్క రామ్ ముగ్గురు కూడా ఒకరకంగా ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు. చాలా రాక్షస ప్రయత్నాల తర్వాత రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అపజయం మూటగట్టుకున్నాడు. 

దాదాపుగా నాని పరిస్థితి కూడా అంతే. మరోపక్క సుధీర్ బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఈ ముగ్గురు హీరోలు కృతి శెట్టి క్రేజ్ వాడుకొని తమ సినిమాను మార్కెటింగ్ చేసుకునే అవకాశం కోసమే ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మన తెలుగు నిర్మాతల విషయానికి వస్తే ఎక్కువగా క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్ లని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి సమయంలో కృతి కంటే క్రేజ్ ఎక్కువ ఉన్న హీరోయిన్ మరి ఇంకెవరూ లేకపోవడంతో వాళ్లు కూడా వెంటనే ఆమెకు అవకాశాలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. ఆమె క్రేజ్ ఈ హీరోలకు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: