ఇక ఆసీస్ సిరీస్నుంచి రిషబ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. చాలా ఇన్నింగ్స్లలో 90ల వరకు వెళ్లినా.. అక్కడ అవుటైపోయేవాడు. అయితే ఈ సారి మాత్రం సెంచరీ మార్క్ దాటాడు. దీంతో రిషబ్తో పాటు భారత క్రికెట్ అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు రిషబ్ నుంచి సెంచరీ చూశామని ఆనందపడిపోతున్నారు. పంత్ కూడా తన సెంచరీతో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.
ఇదిలా ఉంటే అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. రెండో రోజు తొలి రెండు సెషన్లూ ఇంగ్లండ్ పైచేయి సాధించినా.. మూడో సెషన్లో మాత్రం అనూహ్యంగా టీమిండియా పోటీలోకొచ్చింది. రిషబ్ పంత్(101), వాషింగ్టన్ సుందర్(60 నాటౌట్) ఏకంగా 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో భారత జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఇక మరికొద్ది సేపటిలో మూడో సెషన్ ముగుస్తుందనగా.. రిషబ్ అవుటైనా ఆ తరువాత వచ్చిన అక్షర్ పటేల్(11)తో కలిసి సుందర్ మరో వికెట్ పడకుండా ఆచి తూచి ఆడాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.