ప్రస్తుతం ఈ సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, షాషా ఛత్రి, జయరాం, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమా ని అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలోని తన పాత్ర కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుని యాక్టింగ్ చేస్తున్నారని, ఇటీవల ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవీ ఆశించిన స్థాయి సక్సెస్ ని అందుకోకపోవడంతో ఎలాగైనా ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టి తన ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని ఫిక్స్ అయ్యారట హీరో ప్రభాస్.
ఇక ఈ సినిమా జులై 30 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని యూనిట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక అతి త్వరలో ట్రైలర్ కట్ కి సంబందించిన వర్క్ ని రాధేశ్యామ్ యూనిట్ మొదలెట్టనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే నిజంగా ఇది రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అనే చెప్పాలి....!!