పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. దాదాపుగా తొమ్మిదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టి సరికొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేసి హీరోయిన్ గా శృతి హాసన్ కి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే దాని తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి హరీష్ శంకర్ తీసిన రామయ్య వస్తావయ్యా మూవీ లో సమంత తో పాటు శృతి కూడా ఒక హీరోయిన్ గా నటించింది.

అయితే అనూహ్యంగా ఆ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు. అయితే ఆ మూవీ ద్వారా తొలిసారిగా ఎన్టీఆర్ తో జత కట్టిన శృతి హాసన్, ఫస్ట్ కాంబో తోనే ఫ్లాప్ ని చవి చూసింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు మరొక్కసారి ఆమె ఎన్టీఆర్ తో నటించనే లేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్, దీని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్నారు.

హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ భారీ సెటైరికల్ పొలిటికల్ కమర్షియల్ మూవీ లో ఎన్టీఆర్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, అలానే ఆయన ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ ని అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు త్రివిక్రమ్మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేసారని అంటున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా పలువురు హీరోయిన్స్ పేర్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీలో ఇటీవల శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైందని, ఇప్పటికే ఆమెతో దర్శకనిర్మాతలు ఒప్పందం కూడా చేసుకున్నారని, త్వరలో దీనికి సంబంధించి అధికారిక న్యూస్ బయటకు రానుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఎన్నో ఏళ్ళ తర్వాత మరొకసారి ఎన్టీఆర్, శృతి ల జోడిని తెరపై చూడవచ్చు.......!!


   

మరింత సమాచారం తెలుసుకోండి: