అయితే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నటన విషయంలో పాత్ర విషయంలో మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు అన్నది మాత్రం తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ.. మరోవైపు పలు సినిమా స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అన్న విషయం తెలిసిందే. రంగస్థలం సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ రంగమ్మత్త గా మారిపోయింది యాంకర్ అనసూయ. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీగా కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ గా కెరియర్ కొనసాగిస్తున్న యాంకర్ అనసూయ కన్ను బాలీవుడ్ పై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో కూడా అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నాలుమొదలు పెట్టిందట అనసూయ. ఇప్పటికీ పలు భాషలలో ఛాన్స్ కొట్టేసిన ఈ యాంకరమ్మ బీ టౌన్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇక కొంతమంది సినీ దర్శకుడు కూడా అనసూయను సంప్రదిస్తున్నట్లు టాలీవుడ్ లో ఒక టాక్ హల్ చల్ చేస్తుంది ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం అనసూయ క్లారిటీ ఇవ్వాల్సిందే.