ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచిన జాన్వీ దోస్తానా 2 సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉండగా దోస్తానా కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తుండడం విశేషం.. ఈ సినిమా తో పాటే గుడ్ లక్ జెర్రీ అనే సినిమా ని కూడా చేస్తుంది జాన్వీ.. ఇవే కాకుండా టాలీవుడ్ లో ఎంట్రీ కోసం ఆమెను సంప్రదింపులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అంటుంటారు.. ఇక జాన్వీ ఇటీవలే తనకు కాబోయే భర్త గురించి పగటి కలలు కంటోంది.
నా పెళ్లికి సంబంధించి నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది. నాకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉంది. అందులో సన్నిహితులు మాత్రమే ఉండాలి. నేను కాంచీవరం చీరను ధరించి, బంగారం పెట్టుకొని, నా తలలో పూలను పెట్టుకోవాలి. నా భర్త లుంగీలో ఉండాలి. ఆ తరువాత మేమిద్దరం అరటాకులో భోజనం చేయాలి అని అన్నారు.ఇక ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు.. తిరుపతిని నేను చాలా సార్లు సందర్శించా. నా జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లిని.. నాకు ఇష్టమైన వాడితో అక్కడే చేసుకోవాలనుకున్నా. గతంలో నేను అక్కడ జరిగిన మా బంధువుల పెళ్లికి వెళ్లా. చాలా ఎంజాయ్ చేశా. ఆడంబరంగా జరిగే పెళ్లిళ్లంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి పెళ్లిళ్లకు వెళ్లడం ఫన్ అనిపించినా.. అలాంటి పెద్ద శుభకార్యంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటం నాకు ఇష్టం అని జాన్వీ చెప్పుకొచ్చారు.