ఇటీవలే చెక్ సినిమా తో నిరాశపరిచిన నితిన్ వెంటనే రంగ్ దే చిత్రం ని ప్రేక్షకుల ముందుకు తెచ్చెదుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.ఈ సినిమా కి వెంకీ అట్లూరి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అయన చూస్తున్నారు..

వెంకీ అట్లూరి తన తొలి రెండు సినిమాలకు తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోగా ఈ సారి మాత్రం దేవి శ్రీ తో పనిచేస్తున్నాడు.. అయితే మార్పు కోరుకోవడం సహజమే అయినా మూడో సినిమా కె తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కనపెట్టేయడం అందరికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.  నిజానికి వారి కలయికలో వచ్చిన తొలి రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్.. తమన్ సంగీతం వల్లే ఆయన తొలి రెండు సినిమాలు మంచి హిట్ సినిమాలుగా పేరొచ్చాయి.. అయితే ఇంతటి హిట్ కాంబో నుండి మరిన్ని హిట్ ఆల్బమ్స్ వస్తాయి అని అనుకున్నారు కానీ మూడో సినిమా కి సంగీతం దర్శకుడిని మార్చేయడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగింది..

ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి వచ్చిన పాటల కు మంచి స్పందన దక్కుతుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాటకు విశేష స్పందన దక్కితుంది. గత కొన్ని రోజులుగా దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయిందన్న వారికి ఈ పాట సమాధానం అని చెప్పొచ్చు.. దేవి శ్రీ ప్రసాద్ తన జోనర్ నుంచి బయటకి వచ్చి చేసిన ఈ పాట ఎంతో ఫీల్ గుడ్ గా ఉండడంతో పాటు అందరిని ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇప్పటికే మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది. దీనికి మ్యూజిక్ కూడా తోడయ్యింది.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: